మహబూబ్ నగర్: జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం దగ్గర నివాళులు అర్పించారు. అనంతరం నూతన కలెక్టరేట్ కార్యాలయం నందు జాతీయ జెండాను ఎగురవేసి ప్రజా పాలన దినోత్సవం వేడుకలను శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, అధికారులు పాల్గొన్నారు