న్యూఢిల్లీ: పెరూ వేదికగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాం పియన్షిప్ జరగనుంది. ఈ టోర్నీకి భారత జూనియర్ షూటర్ల బృందం సోమవారం లిమాకు బయల్దేరి వెళ్లింది. పెరూకు వెళ్లిన తొలి బ్యాచ్ లో 40 మంది షూటర్లు సహా 14 మంది కోచ్లు, ఐదుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. రైఫిల్, పిస్ట ల్, షాట్గన్ ఈవెంట్లో పోటీలు జరగనున్నాయి. భారత్ తరఫున ముకేశ్ నెలవాలి పురుషుల 10 మీ ఎయిర్ పిస్టల్తో పాటు 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లోనూ పోటీలో పాల్గొననున్నాడు.