25-03-2025 07:52:27 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న ఎండి అఫ్రిద్ బిఈ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరో వైపు అన్ని ఉన్నత పరీక్షలను రాశారు. చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ కు చెందిన సింగరేణి కార్మికుడు అహ్మద్ రజాక్, ఫాతిమా దంపతుల రెండో కుమారుడు అయిన ఎండి అఫ్రిద్ వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నారు.
ప్రస్తుతం ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి గతంలో ఆర్ఆర్బి, ఎన్ టీపీసిలలో ఉద్యోగాలను సాధించి ప్రస్తుతం టేకులపల్లి మండల తహశీల్దార్ ఆఫీస్ లో జూనియర్ సహాయకుడిగా పని చేస్తూ గ్రూప్ 4 జిల్లాలో 3వ ర్యాంక్ సాధించారు. గ్రూప్ వన్ లో 448 మార్కులు, గ్రూప్-2 లో 377 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 313 ర్యాంక్ పొందారు. గ్రూప్-3 లో 22వ ర్యాంకు సాధించడం విశేషం. ఒక జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 21 ర్యాంకు సాధించడంతో అఫ్రిద్ కు టేకులపల్లి మండల తహశీల్దార్ నాగ భవాని, ఉప తహసీల్దార్ ముత్తయ్య, కార్యాలయ సిబ్బంది ఆయనను అభినందిస్తూ మంగళవారం సన్మానించారు. ఈ సందర్బంగా తోటి ఉద్యోగస్తులకు తహశీల్ కార్యాలయంలో అఫ్రిద్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.