calender_icon.png 20 September, 2024 | 12:10 PM

నేరం ఒప్పుకున్న సీరియల్ కిల్లర్

21-07-2024 09:19:57 PM

నైరూబీ: రెండేళ్ల నుంచి వరుసగా మహిళలను కిరాతకంగా చంపి, వారి శరీర భాగాలను డంపింగ్ యార్డుల్లో పడేస్తున్న సీనియర్ కిల్లర్ ఎట్టకేలకు పోలీస్ కస్టడీలో నిజం ఒప్పుకున్నాడు. 33 సంవత్సరాల కొల్లిన్స్ జమైసీ కాలుషా ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యతో సహా 42 మంది మహిళల ప్రాణాలను తీసినట్లు తను ఒప్పుకున్నాడు. అతడికి మనిషి ప్రాణాలంటే ఏ మాత్రం లెక్కలేదని పోలీసులు చెబుతున్నారు. 2022 నుంచి అతడు హత్యలు చేస్తున్నా పాపం పండి 11 జూలై 2024న అరెస్ట్ అయినట్లు పోలీసులు పేర్కొన్నారు.