జుక్కల్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వినతి
కామారెడ్డి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి అత్యంత వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఏఐజి హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.