calender_icon.png 4 October, 2024 | 5:01 PM

దుర్గామాత మండపంలో పూజలు నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే దంపతులు

04-10-2024 02:08:44 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్  నగర్ మండల కేంద్రంలో నీ దుర్గామాత మండపంలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆయన సతీమణి తోట అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు.