13-02-2025 02:08:03 AM
పెద్ద కొడప్గల్ ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): సుదీర్ఘ కాలం పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నడిపించి, ఎస్సీ వర్గీకరణ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లోని తన ఇంటికి ఆహ్వానించారు. అనంతరం పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి సత్కరించారు.
అదే విధంగా మంద కృష్ణ మాదిగ వెంట వచ్చిన ఎమ్మా ర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్, ప్రముఖ రచయిత మచ్చ దేవేందర్, పాటమ్మ రాంబాబు, జైభీమ్ టీవీ సంస్థల చైర్మన్ బరిగెల శివ తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఉద్యమానికి అందించిన సాయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో ఎమ్మెల్యే కృషి మరువలేనిది అని కొనియాడారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు చెందిన ప్రతీ ఒక్కరికీ సామజిక న్యాయం జరగాలన్నారు.