calender_icon.png 24 September, 2024 | 11:53 PM

మహిళా న్యాయవాదిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు

21-09-2024 02:33:13 AM

సుప్రీం కోర్టు ధర్మాసనం సీరియస్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాదిని కించపరిచేలా, ప్రాంతాల పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు జడ్జిపై శుక్రవారం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. ఇటీవల ఓ భూవివాదం కేసు కర్ణాటక హైకోర్టుకు రాగా, న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద విచారించారు. పిటిషన్‌లో పేర్కొన్న ప్రాంతాన్ని న్యాయమూర్తి పాకిస్థాన్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక, కేసును వాదించిన మహిళా న్యాయవాదిపైనా న్యాయమూర్తి అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లింది. వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తుల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.