- మిత్రులతో కలిసి వెళ్లి..
- తెల్లారేసరికి ఉరేసుకుని..
- రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ
శేరిలింగంపల్లి/జడ్చర్ల, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఇద్దరు స్నేహితులతో కలిసి హోటల్కు వెళ్లిన యువతి తెల్లారేసరికి అనుమానాస్పదస్థితిలో ఉరేసుకుని మృతిచెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న అంజయ్యనగర్లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేటకు చెంది న శ్రుతి(23) హైదరాబాద్లో నర్సింగ్ పూర్తి చేసి అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో నర్సుగా పనిచేసింది. కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసి సొంతూరుకు వెళ్లింది. ఇటీవలే హైదరాబాద్కు తిరిగి వచ్చిన శ్రుతి గచ్చిబౌలి డివిజన్ చిన్న అంజయ్యనగర్లోని ఓ హాస్టల్లో ఉంటుంది. ఆదివారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న రెడ్స్టోన్ హోటల్కు వెళ్లింది.
సోమవారం తెల్లవారుజామున హోటల్ లోని ఓ గదిలో ఫ్యానుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హోటల్ గదిలో బీరు బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లను పోలీసులు కనుగొన్నారు. బెడ్ మీద, బెడ్ కింద రక్తపు మరకలు గుర్తించా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. తమ కూతురుది ఆత్మహత్య కాదని, అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హోటల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్ప ద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు తెలిపారు.