calender_icon.png 18 October, 2024 | 1:59 PM

కడవెర్గు శివారులో బ్రిడ్జి నిర్మాణం పట్ల హర్షం..

18-10-2024 11:51:31 AM

బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నాయకులు

చేర్యాల (విజయక్రాంతి): చేర్యాల మండలంలోని కడవేర్గు, పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మిస్తే కడవేర్గు, పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, నాగపురి, శభాష్ గూడెం తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. బ్రిడ్జి నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం. భారీ వర్షాలకు వచ్చే వరద నీటి వల్ల కల్వర్టు దాటడం ఇబ్బందిగా మారేది. గతంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి నాయకులు మూడు శిలాఫలకాలు వేసి చేతులు దులుపుకున్నారు. ఆలస్యమైనప్పటికీ బ్రిడ్జి నిర్మించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పనులు మంజూరు చేయించినందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలతోపాటు, కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్, చింతల మోహన్, బాల్ చంద్రం, వెంకటస్వామి  తదితరులు పాల్గొన్నారు.