calender_icon.png 17 October, 2024 | 8:54 PM

జర్నలిజం విలువలను కాపాడాలి: మోతె వెంకట్ రెడ్డి

17-10-2024 06:15:17 PM

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన మోతే వెంకట్ రెడ్డి

కాప్రా, (విజయక్రాంతి): కాప్రా ప్రెస్ క్లబ్ ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు క్లబ్ లో ఉన్న మెజారిటీ సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో ఎన్నికల అధికారి మోతె వెంకట్ రెడ్డి ప్రకటించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా వల్లోజు శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాలబోయిన విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వేముల శంకర్, ఉపాధ్యక్షులుగా ఆదిమూలం శ్రీనివాస్, ఎండి అక్బర్, ఏ. నటరాజ్, జి.గోపాల్ గౌడ్ కోశాధికారిగా రుద్రగోని నర్సింగ్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా బసంత్ రెడ్డి,శ్రీనివాస్ యాదవ్, సురేష్, ప్రశాంత్, కార్యనిర్వహక కార్యదర్శులుగా వెంకట్, చుక్క రమేశ్ లు కార్యవర్గ సభ్యులుగా, రవి కిరణ్, దిలీప్, విజయ్, ప్రధాన సలహాదారునిగా మోతె వెంకటరెడ్డి, సలహా దారులుగా మెరుగు చంద్రమోహన్, టి.మల్కయ్య, జి. చంద్రమౌళి, జ్యోతిర్మయి చారి,సహదేవ చారి, కేసీ మోహన్, శ్రీనివాసరావు, కడియాల రమేష్ సత్యనారాయణ, శనిగరం అశోక్, సీర శ్రీనివాస్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జర్నలిస్ట్ మిత్రులందరూ జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా మోతె వెంకట్ రెడ్డి సూచించారు. అలాగే అందరూ ఏకతాటిపై ఉన్నప్పుడే మన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు.