02-04-2025 12:12:52 AM
కడ్తాల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : కడ్తాల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాసంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు మంగళవారం బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీలో చేరినవారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్, మాజీ ఎంపిటిసి లచ్చిరాం నాయ క్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, నాయకులు పాల్గొన్నారు.