14-04-2025 12:00:00 AM
హుజూర్ నగర్, ఏప్రిల్ 13: గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ-2 మేళ్లచెరువు వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఏమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి,రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు మాశెట్టి శ్రీహరి, అధికార ప్రతినిధి రామ్ సైదులు, రామచంద్రాపురం మాజీ సర్పంచ్ బొలిశెట్టి సుధీర్, నియోజకవర్గ యూత్ నాయకులు అనంతు కర్ణాకర్ గౌడ్,అనంతు తరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.