calender_icon.png 25 September, 2024 | 8:08 AM

జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ నేటికి వాయిదా

25-09-2024 02:42:38 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్24: పోక్సో కేసుతో పాటు ఇతర కేసుల్లో నిందితుడైన జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. తాము పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు నిందితుడిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారించి వాయిదా వేసింది. ఈనెల 19న జానీ మాస్టర్ అరెస్టు కాగా పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. తర్వాత కేసు విచారణను వేగవంతం చేసేందుకు కోర్టును నిందితుడి కస్టడీని కోరుతున్నారు.