calender_icon.png 17 March, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టబద్ధత తరువాతనే ఉద్యోగాలను చేపట్టాలి..

17-03-2025 04:48:00 PM

ఆరవ రోజుకు చేరిన రీలే నిరాహార దీక్ష ...

వైరా (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆరవ రోజు రిలే నిరసన దీక్షలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట కోటి మాదిగ మండల ఇన్చార్జ్ కరిశ రమేష్ మాదిగ ఆధ్వర్యంలో వైరా రింగ్ రోడ్ సెంటర్ నందు బి ఆర్ఎస్ నాయకులు ఆదూరి ప్రేమ్ మాజీ వార్డు మెంబర్ మోదుగు లక్ష్మయ్య టిడిపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పమ్మి అర్జున్ రావు ఈ దీక్షలను ప్రారంభించినారు. వైరా శాంతినగర్ ఎస్సీ కాలనీ 14 వార్డుకు చెందిన జై భీమ్ వారియర్స్ సభ్యులు పమ్మి దాసు కుక్కల నాగభూషణం చాట్ల దానియేలు పింగళి చలపతి ఆర్ఎంపి పమ్మి సైదులు దేవరపల్లి కాంతారావు నల్లగట్ల సాయి కాకాటి నరసింహారావు మోదుగు సుధాకర్ కరిశ వాసు తదితరులు పాల్గొన్నారు.