calender_icon.png 15 October, 2024 | 7:43 AM

చికెన్ బిర్యానీలో జెర్రీ

15-10-2024 02:29:26 AM

ఫుడ్‌సేఫ్టీ అధికారులకు వినియోగదారుడి ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్ జాతీయ రహదారిలో భువనగిరి బైపాస్ వద్ద ఉన్న వివేరా హోటల్‌లో సోమవారం మధ్యా హ్నం చికెన్ బిర్యాని ఆర్డర్ చేసుకొని తింటున్న వినియోగదారుడికి అం దులో చచ్చిపడి ఉన్న జెర్రీ ప్రత్యక్షమైంది.

దీంతో ఒక్కసారి కంగు తున్న వినియోగదారుడు హోటల్ నిర్వాహకులకు విషయం చెప్పగా అతడికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినవినియోగదారుడు.. ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటళ్లు, రెస్టారెంట్లపై  

అధికారుల నిఘా కొరవడటంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని హోటళ్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.