calender_icon.png 5 October, 2024 | 4:49 PM

ఖమ్మం పట్టణంలో జీవీ మాల్

05-10-2024 01:53:29 AM

నేడు ప్రారంభించనున్న కీర్తి సురేష్ 

ఖమ్మం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఖమ్మం వైరా రోడ్డులోని జిల్లా కోర్టుకు అతి సమీపంలో ఏర్పాటు చేసిన బిగ్గెస్ట్ జీవీ మాల్ వస్త్ర కాంప్లెక్స్ శనివారం కన్నుల పండువగా ప్రారంభంకాబోతున్నది. ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నదని యాజమాన్యం తెలిపింది. ఇప్పటికే ఖమ్మం కస్బా బజార్‌లో  అత్యంత ప్రజాధరణ పొందిన సంగతి విధితమే.

ఖమ్మం కస్బా బజార్‌లో గత 14 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజల ప్రేమాభిమానాలు, మహిళల ఆదరణ చూరగొన్న జీవీ మాల్ యాజమాన్యం వైరా రోడ్డులో కూడా నూతన అతిపెద్ద షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.