calender_icon.png 20 April, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ కబ్జా కేసులో చేవెళ్ల పీఎస్‌కు జీవన్‌రెడ్డి

17-04-2025 12:49:04 AM

 చేవెళ్ల, ఏప్రిల్ 16 :  భూకబ్జా కేసులో విషయంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యా రు.

చేవెళ్ల మండలం ఈర్లపల్లిలో 20 ఎకరాల భూమిలో ఉన్న ఫంక్షన్ హాల్ను కూల్చివేసి ఆక్రమించడంతో పాటు  బెదిరింపులకు పాల్పడ్డారని సామ జీవన్ రెడ్డి & జీవన్ రెడ్డి ఆయన భార్య, తల్లిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వాదనలు ముగియగా... జడ్జి తీర్పు రిజర్వ్  చేశారు.  కాగా, జీవన్ రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని,  పోలీసుల విచారణ ఆపాలని అప్పీల్ చేసుకున్నారు. 

 దీన్ని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారించిన సర్వోన్నత న్యాయ స్థానం అతన్ని అరెస్ట్ చేయవద్దని ఆర్డర్ ఇచ్చింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేయడంతో  ఇప్పటికే మోకిలా పీఎస్ కు రెండు సార్లు హాజరైన ఆయన... తాజాగా చేవెళ్ల కు వచ్చారు. రెండు గంటల పాటు విచారించిన పోలీసులు పలు వివరాలు సేకరించారు.