న్యూఢిల్లీ: భారత డబుల్స్ ద్వయం జీవన్ నెడుంచియాన్- విజయ్ సుందర్ ప్రశాంత్ తమ కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్ను దక్కించుకున్నారు. మంగళవారం ఈ జంట హంగ్జౌ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నారు. డబుల్స్ ఫైనల్లో జీవన్ జోడీ 4-6, 7-6(5), 10-7 తేడాతో జర్మనీకి చెందిన ఫ్రాంట్జెన్ జోడీ మీద విజయం సాధించారు.
గంటా 49 నిమిషాల పాటు సాగిన పోరులో జీవన్ జోడీ తొలి సెట్ కోల్పోయినా కానీ చివరకు మ్యాచ్ గెలిచి సత్తా చాటింది. 35 సంవత్సరాల జీవన్కు ఇది రెండో ఏటీపీ టూర్ టైటిల్. 2017లో రోహన్ బోపన్నతో కలిసి చెన్నై ఓపెన్ గెలిచాడు. విజయ్కి మాత్రం ఇదే మొదటి ఏటీపీ టూర్ టైటిల్ కావడం గమనార్హం. ఇక బీజింగ్ ఓపెన్లో ఆడుతున్న భారత సింగిల్స్ టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ తొలి రౌండ్కే పరిమితమయ్యాడు.