calender_icon.png 11 March, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్ రెండో దశ

11-03-2025 12:02:41 AM

పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ రెండో దశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సోమవారం విడుదల చేసిం ది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపిం ది. పేపర్-1 పరీక్షను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు షిప్టుల్లో, 8వ తే దీన మొదటి షిప్టులో జరగనుంది.

అలాగే ఏప్రిల్ 9న పేపర్-2ఏ, పేపర్-2బీ పరీక్షలు నిర్వహించనున్నా రు. ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిప్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిప్ట్ జరగనున్నాయి.