కొలంబొ: మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య శ్రీలంక జట్టుకు పూర్తి స్థాయి హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ వరకు జయసూర్య ఈ పదవిలో కొనసాగుతాడని లంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లండ్లతో జరిగిన సిరీస్ల్లో కోచ్గా జయసూర్య తన పాత్రను సమర్థంగా పోషించడంతో అతడికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పజెప్పినట్లు బోర్డు తెలిపింది. స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్ నుంచి జయసూర్య ఫుల్టైమ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.