న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలిన ఘటనలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన ఇద్దరు సిబ్బంది మృతి చెందగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ల బృందాలు దుర్బెడలో ఆపరేషన్ నిర్వహించి నారాయణపూర్కి తిరిగి వస్తుండగా, అబుజ్మద్ ప్రాంతంలోని కొడ్లియార్ గ్రామ సమీపంలో ఒక ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం పేలింది.
ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి మృత్యువాతపడ్డారు. బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్గా గుర్తించారు. జవాన్ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ మృతదేహాన్ని నేడు స్వగ్రామానికి చేరుకోనుంది. జవాన్ రాజేష్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ పేలుడులో మహారాష్ట్రలోని సతారాకు చెందిన అమర్ పన్వర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
దంతెవాడ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దంతేవాడ-నారాయణపూర్ సరిహద్దు సమీపంలోని నెందుర్, తుల్తులి గ్రామ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది నక్సల్స్ మరణించారు. ఎన్కౌంటర్లో మరణించిన 38 మంది నక్సల్స్లో 31 మంది కార్యకర్తల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 29 మంది కార్యకర్తల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు ప్రకటన పేర్కొంది. ఎన్కౌంటర్లో చనిపోయిన 38 మంది నక్సల్స్ను అధికారులు గుర్తించారు.