calender_icon.png 28 September, 2024 | 2:58 PM

రంగారెడ్డి జిల్లా కోర్టుకు కొరియోగ్రాఫర్ జానీ

28-09-2024 12:40:14 PM

రాజేంద్రనగర్: నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ను రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు అతడిపై లైంగిక దాడి, పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు నాలుగు రోజుల కస్టడీ మంజూరు చేసిన విషయం విధితమే. నేటితో ఆయన కస్టడీ పూర్తి కావడంతో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు తిరిగి రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయనను నార్సింగి ఈ పోలీసులు విచారణ జరిపారు. బాధిత యువతి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ప్రశ్నలు కురిపించి పలు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తుంది.