calender_icon.png 20 September, 2024 | 12:21 PM

దేశాభివృద్ధి కోసమే జమిలీ ఎన్నికలు

19-09-2024 12:54:18 AM

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): దేశాభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జమిలీ వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయన్నారు. దేశంలో నిత్యం ఏదో చోట ఎన్నికలు జరుగుతుండడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని అన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశ అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలు కొంత మందికి నచ్చవని తెలిపారు. జమీలీపై ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరం ఉంటే పార్లమెంటులో జరిగే చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలుపవచ్చని పేర్కొన్నారు. దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే లక్ష్యంగా మోదీ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నదని ఆయన అన్నారు. 75 ఏళ్ల పైబడిన ఆరు కోట్ల మందికి హెల్త్ కార్డులు అందించిన ఘనత మోదీకే దక్కిందని స్పష్టం చేశారు.