calender_icon.png 17 October, 2024 | 1:48 PM

పాక్ ప్రభుత్వానికి జైశంకర్ చురకలు

17-10-2024 01:20:48 AM

ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ ఉద్బోధ

ఇస్లామాబాద్, అక్టోబర్ 16: రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయమై ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పరోక్షంగా పాక్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా బుధవారం జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో ఆయన మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించి విమర్శలు చేశారు.

నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే పొరుగువారు దూరమవుతారని వ్యాఖ్యానించారు. ఈ  సందర్భంగా ఎక్కడా పాకిస్థాన్ పేరు ను నేరుగా ప్రస్తావించలేదు. మీటింగ్ తర్వాత మంత్రి ఎక్స్ వేదికగా స్పంది స్తూ ఇస్లామాబాద్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సులో మన దేశం గొంతును  వినిపించానని చెప్పారు.