calender_icon.png 27 October, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్జరీ కేసులో మహిళకు జైలు శిక్ష, జరిమానా

28-08-2024 12:57:18 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోర్జరీకి పాల్పడిన ఓ మహిళకు జైల్ శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన ముక్కెర నాగలక్ష్మి(38) అనే మహిళకు బెల్లంపల్లి సివిల్ జడ్జ్ జె. ముఖేష్ రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్షతోపాటు, రూ 1000 జరిమానా విధించినట్లు టూ టౌన్ ఎస్ఐ కె.మహేందర్ తెలిపారు. అప్పటి సీఐ మహేష్ బాబు, ఎస్సై ఎం .శ్యాంసుందర్ లు విచారణ పూర్తి చేసి నేరస్తురాలి మీద చార్జీ షీట్ వేశారని చెప్పారు. మహిళా కానిస్టేబుల్ ఎ. తిరుమల సాక్షులను ప్రవేశపెట్టగా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. అజయ్ కుమార్ 18 మంది సాక్షులను మెజిస్ట్రేట్ జె. ముఖేష్ ఎదుట హాజరుపరిచి విచారించగా నిందితురాలిపై నేరం రుజువు కావడంతో ముక్కెర నాగలక్ష్మి కి మెజిస్ట్రేట్ జె. ముఖేష్ రెండు సంవత్సరాల సాధారణ జై రూ 1000 జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చినట్లు ఎస్ ఐ కె. మహేందర్ తెలిపారు.