calender_icon.png 20 September, 2024 | 8:25 AM

మహంకాళి ఆలయ ఈవోకు జైలు శిక్ష

07-09-2024 12:37:30 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే కేసులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఈవో మనోహర్‌రెడ్డికి హైకోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. రూ. ౨ వేల జరిమానా  విధించింది. కరోనా సమయంలో ఆలయానికి చెందిన దుకాణాల లీజు కాలాన్ని జులై 1 నుంచి నవంబర్ వరకు పొడిగించాలని జూన్ 13న హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. వీటిని అమలు చేయలే దంటూ షాపు లీజుదారుడు రాకేశ్  కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశాడు. విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ పైవిధంగా తీర్పు వెలువరించారు.