calender_icon.png 23 October, 2024 | 11:47 AM

చోరీ కేసులో జైలు

23-10-2024 01:20:14 AM

బెల్లంపల్లి, అక్టోబర్ 22: బెల్లంపల్లి పట్టణంలోని ఫారెస్ట్ క్వార్టర్స్ వద్ద గల హనుమాన్ గుడిలో దొంగతనం కేసులో ఇద్దరు దొంగలకు రెం డేండ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని టూ టౌన్ ఎస్సై కే మహేందర్ తెలిపారు. హనుమాన్ గుడితాళం పగులగొట్టి గర్భగుడిలోని బీరువాలో ఉన్న 4 తులాల వెండి హారం, 20 తులాల రెండు వెండి కిరీటాలతో పాటు రూ.౮౦౦ ఎత్తెకెళ్లారని ఆలయ అర్చకులు శ్రీరాంబట్ల హరీశ్‌శర్మ ఫిర్యా దు చేయగా అప్పటి ఎస్సై ఏ ఆంజనేయులు కేసు నమోదు చేసి విచార ణ చేపట్టారు.

నిందితులు మహ్మద్ బద్రుద్దీన్ (బెల్లంపల్లి), సయ్యద్ సికిందర్ అలీ (కాగజ్‌నగర్)పై చార్జీషీట్ నమోదు చేసి కోర్టులో హాజరుపర్చా రు. సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో మెజిస్ట్రేట్ ఇద్దరికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించారు.