calender_icon.png 20 September, 2024 | 6:22 PM

పారితోషికం పెంచేసిన జాన్వీ క‌పూర్

20-09-2024 03:34:53 PM

ముంబై: ప్రముఖ నటి స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవర చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్ సరసన కూడా ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. ఇటీవలే ఈ చిత్రం పూజాకార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే ఈ చిత్రం కూడా సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కినున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో కొనసాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందించనున్నారు. ఇక ఈ రెండు చిత్రాలతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్. దీంతో జాన్వీ తన పారితోషికాన్ని పెంచేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.