calender_icon.png 24 October, 2024 | 6:56 AM

ఫోన్లు పోతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి

12-08-2024 05:49:58 PM

జగిత్యాల: మొబైల్ ఫోన్లు చోరికి గురైనా www.ceir.gov.in సీఈఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక విలేఖరులతో ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా పరిధిలో ఫోన్లు పోగొట్టుకొని, చోరికి గురైన 43 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేశారు. సెల్ ఫోన్ పోయిన, దొంగతనానికి గురైన ఆందోళన చెందవద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లాలో పోగొట్టుకున్న, చోరి గురైన రూ.8 లక్షల విలువైన 43 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. 

ఫోన్లు పోతే, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సీఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఈఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ఈ పోర్టల్  ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 468 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి శిక్షణఇచ్చి సీఈఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.

పోయిన ఫోన్ల పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం నష్టాన్ని చేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని అన్నారు.  దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సీఈఐఆర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాల న్నారు. అదే విధంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా ఐఎంఈఐ నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు.  ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా ఎస్పీ సూచించారు.

సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సీఈఐఆర్ టీం ఆర్ఎస్సై కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు మల్లేశం ,అజర్ యాకూబ్ లను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. తమ యొక్క ఫోన్ పోయినా విధానం, ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు. సాంకేతిక ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను కనిపెట్టి బాధితులు జిల్లా ఎస్పీ అప్పగించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.