calender_icon.png 27 October, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాక్టో నూతన కమిటీ ఎన్నిక

27-10-2024 01:39:23 AM

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాక్టో చైర్మన్‌గా సదానం దంగౌడ్, సెక్రటరీ జనరల్‌గా కృష్ణుడు ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో జాక్టో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా నూతన కమిటీని ఉపాధ్యాయ నేతలు ఎన్నుకున్నారు.

జాక్టో ట్రెజరర్‌గా జీ హేమచంద్రుడు, ప్రచార కార్య దర్శిగా ఎండీ అబ్దుల్లా, కో చైర్మన్లుగా ఎం రాధాకృష్ణ, డీ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా విఠల్, నగేశ్, గౌరవ సలహాదారులుగా ఎం పర్వత రెడ్డి, ఎం చెన్నయ్య తదితరులు ఎన్నికైనట్లు జాక్టో నూతన చైర్మన్ జి సదానందం గౌడ్ తెలిపారు.