రాహుల్కు హరీశ్రావు లేఖ మూసీ బాధితుల కోసం కాదు
కేసీఆర్కు క్యాబినెట్ హోదా ఫామ్హౌస్లో పడుకోవడానికా?
ఎంపీ మల్లు రవి ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి హరీశ్రావు లేఖ రాసింది మూసీ బాధితుల కోసం కాదని, సీఎం రేవంత్రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే అని పీసీసీ సీని యర్ ఉపాధ్యక్షుడు, ఎంపీ మల్లు రవి విమర్శించారు. మూసీని అభివృద్ది చేయాలని సీఎం రేవంత్రెడ్డికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.
మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజల పొట్టగొట్టాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదని స్పష్టంచేశారు. మూసీ విషయంలో ఇంకా డీపీఆరే కాలేదని, పనులు ప్రారంభం కాలేదని, డబ్బులు డ్రా చేయలేదని, అవినీతి జరిగిందని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ హైడ్రాపై ఎందుకు మాట్లాడటం లేదని, క్యాబినెట్ ర్యాంకు ఇచ్చింది ఫామ్హౌస్లో పడుకోవడానికా? అని విరుచు కుపడ్డారు. మూసీ అభివృద్ధిపై కేసీఆర్ సలహాలు, సూచనలకు సంబంధించి బ్లూ ప్రింట్ ఇవ్వాలని సూచించారు. హైడ్రాను హైకోర్టు ఆపలేదని, కేవలం సూచన మాత్ర మే చేసిందని స్పష్టం చేశారు.