15 June, 2026 | 2:45 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

సర్దుకుపోతే ఆనందమే!

27-04-2025 12:00 AM

వివాహ బంధం శాశ్వతమైంది. ఈ విషయం తెలిసినా కొన్ని జంటలుచిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ.. నూరేళ్ల అనుబంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అయితే ఇందుకు వారు తమ అనుబంధంలో కొన్ని అంశాల్ని స్వీకరించలేకపోవడం, జీర్ణించుకోలేపోవడమే కారణమంటున్నారు నిపుణులు. భార్యాభర్తలన్నాక గొడవలు పడటం, కాసేపటికే తిరిగి కలిసిపోవడం సహజం.

అయితే కొంతమంది వీటిని భూతద్దంలో పెట్టి మరీ భాగస్వామిలోని లోపాల్ని, వారు చేసిన తప్పుల్ని వెతుకుతుంటారు. నిజానికి ఇలా మీ మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోతే.. ప్రతిదీ నెగెటివ్‌గానే కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రతిదానికీ అవతలి వారి మీద అనుమానం పెరిగిపోతుంది.

దీనివల్లే చాలా జంటలు విడిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరికి అనుమానం లేకుండా ఉండాలంటే.. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు పారదర్శకంగా వ్యవహరించడం ముఖ్యం. ఇదే ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచి.. ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.