హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీఐ ఏర్పాటుకు రూ.11,37,21,033 నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐటీఐ కళాశాలకు ఒకేసారి 200 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంటుందని, అన్నివిభాగాలు కలిపి 26 సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు.