calender_icon.png 22 April, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్న ఐటీడీఏ పీవో రాహుల్

22-04-2025 01:26:00 AM

పిఓని ప్రశంసించిన భద్రాచలం ఎమ్మెల్యే తేల్లం వెంకట్రావు

భద్రాచలం, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు, గిరిజన సాంప్రదాయాలను నేటితరం యువతీ యువకులు ఆచరించే విధంగా కృషి చేస్తున్న ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ను భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అభినందించారు . సోమవారం  భద్రాచలం పట్టణం లోని కుర్రాజుల గుట్టలోని ఏహెచ్‌ఎస్ బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ 25.50 వేల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తో ప్రారం భించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారికి అన్ని రకా ల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, అందుకు విద్యార్థులు తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి వృద్ధిలోకి రావాలని కోరారు. ఐటీడీఏ పీవో గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి అహర్నిశలు గిరిజన సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, అలాగే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంత రించిపోకుండా నేటితరం గిరిజన యువతి యువకులు కాపాడుకోవడానికి, ఎనలేని కృషి చేస్తూ పాతతరం గిరిజన కళాఖ ండాలను సేకరించి గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆయన అన్నారు.

అనంతరం ఐటీడీఏ పీవో బి రాహుల్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులే కాక 8వ,9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు పదో తరగతి అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో, ఇప్పటి నుండే కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యా ఉద్యోగ సమాచారం పిల్లలందరూ తెలుసుకునే విధం గా పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజ నం వడ్డిస్తున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలిసి వారు భోజనం చేశారు.

వేసవి సెలవులు ఇవ్వగానే విద్యార్థులు వారి ఇండ్లకు వెళ్లిపోతారని, సంబంధిత ప్రధానోపాధ్యాయులు వార్డెన్ లు పాఠశాలల్లో ఏమైనా మైనర్ రీపేర్లు ఉంటే ఇంజనీరింగ్,గిరిజన సంక్షేమ అధికారులు పాఠశాలల నుండి వివరాలు వివరాలు తెప్పించి సెల వులోనే మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్,ఏ టి డి ఓ అశోక్ కుమార్, హెచ్‌ఎం నరేందర్,డి ఈ హరీష్, టి ఏ శ్రీనివాసరావు, ఏ ఈ ప్రసాద్, వార్డెన్ మోహన్,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.