11-03-2025 12:00:00 AM
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కాలమేగా కరిగింది’. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై మరే శివశంకర్ నిర్మించారు. సింగార మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పొయెటిక్ ఫిల్మ్ ‘కాలమేగా కరిగింది’ ఈ నెల 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, ‘ఊహలోన ఊసులాడే..’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టిక్ వ్యాల్యూస్ ఉన్న లవ్ స్టోరీగా ‘కాలమేగా కరిగింది’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని మూవీ మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.