సరాదా కోసమో, జ్ఞాపకాలనో తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచటం మూలంగా కొందరు క్రూరులు వాటిని ప్రమాదకర రీతిన వాడుతున్నారంటూ హీరో సాయి దుర్గా తేజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.“సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయానకంగా మారిపోతున్నాయి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలు ఆన్లైన్ వేదికల్లో పంచుకునేటపుడు ఓ మారు ఆలోచించండి. తద్వారా కొందరు మానవ మృగాల నుండి మీ పిల్లలను కాపాడుకోండి” అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
తల్లిదండ్రులు సాధారణంగా పోస్ట్ చేసే వీడియోలపై అసభ్యకరమైన కామెంట్లు, మార్ఫింగ్ వంటి విషయాలపై ఈ విధంగా స్పందించిన ఆయన, ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళారు. చిన్నారుల భద్రత గురించి ఆలోచించాల్సిన సమయమిదని పేర్కొన్న సాయి దుర్గా తేజ్, ఎక్స్లో తాను చేసిన పోస్ట్కి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు నారా లోకేశ్ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తూ, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఈ తరహా ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సందిగా వారిని కోరారు.