calender_icon.png 17 October, 2024 | 5:49 AM

బహుజనుల కోసం పోరాడేది బీఎస్పీనే

17-10-2024 01:39:26 AM

బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయ క్రాంతి): దేశంలో బహుజనుల కోసం పోరాడే పార్టీ బీఎస్పీ మాత్రమేనని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపడతామని స్ప ష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తెలు గు రాష్ట్రాల కార్యవర్గాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంజీ గౌతమ్ మాట్లాడుతూ క్యాపిటలిస్టు మనువాద పార్టీల పాలనలో దేశమంతా అల్లకల్లోలమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ ర్గాలను దశాబ్దాలుగా రాజ్యాధికారానికి దూరం చేస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.