calender_icon.png 22 October, 2024 | 6:00 AM

లవ్‌రెడ్డి రాతిగుండెలనైనా కరిగిస్తోందని చెప్తున్నారు

20-10-2024 12:00:00 AM

అంజన్ రామచంద్ర, శ్రావణిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం  ‘లవ్‌రెడ్డి’. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సునంద బి.రెడ్డి, హేమలతరెడ్డి, రవీందర్ జి, మదన్‌గోపాల్‌రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిం చారు. ఈ 18న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సంద డి చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ యూని ట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో శనివా రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   హీరో మాట్లాడుతూ.. “లవ్‌రెడ్డి’ థియేటర్లలో గెలిచాడు.

మంచి సినిమాను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆడియన్స్ వద్దకు మా సినిమాను తీసుకెళ్లడంలో మేమే ఫెయిల్ అయ్యాం. సినిమా చూసిన కొంద రు తమ లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెబుతూ ఉద్వేగానికి గుర వుతున్నారు” అన్నారు. హీరోయిణ్ శ్రావణి మాట్లాడుతూ - ‘లవ్‌రెడ్డి’ సినిమా ప్రేక్షకుల నుంచి నాకు సుమారు రెండు వేల మెసేజ్‌లు వచ్చాయి. క్లుమైక్స్ ఎంతటి రాతి గుండెలనైనా కరిగించేలా ఉందంటూ ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం అందరూ పాల్గొన్నారు.