- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
పటాన్చెరు, అక్టోబర్ 2: హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడ సర్వే నంబర్ 12లో ఇటీవల హైడ్రా కూల్చివేసిన ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఆక్రమించి ఫామ్హౌస్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టిన బడాబాబుల నిర్మాణాలను తొలగించడాన్ని తాము తప్పుపట్టడం లేదని, కాయకష్టం చేసుకొని సొంతింటి కల ను సాకారం చేసుకుంటున్న నిరుపేదల జోలికి రావడం అన్యాయమ న్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్, కార్యదర్శివర్గ సభ్యు డు నరసింహ, జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్, ప్రకాశ్ రావు పాల్గొన్నారు.