మాజీ మంత్రి జగదీష్రెడ్డి
సూర్యాపేట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు సమీపంలో నివాసం ఉంటున్న బాధితులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీలోని 42, 43 వార్డుల్లో పర్యటించి మాట్లాడారు. కష్టపడి రూపాయి రూపాయి పోగుచేసుకుని నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చివేయడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సరైందికాదన్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్ అనుమతితోనే ఇళ్లను నిర్మించుకున్నారని, ఆ ఇళ్లకు నల్లా కనెక్షన్, వీధికి రోడ్లను వేయించుకుని జీవిస్తున్నారని చెప్పారు. ఇళ్లను కూల్చివేస్తే వారు ఎటు పోవాలని ప్రశ్నించారు. కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు.