calender_icon.png 21 October, 2024 | 3:24 AM

సన్నాలకు మాత్రమే బోనస్ అనడం సరికాదు

21-10-2024 12:48:09 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

చేర్యాల, అక్టోబర్ 20: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని  జనగామ ఎమ్మెల్యే పల్లా రాజే శ్వర్‌రెడ్డి రైతులను కోరారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని.. చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు, దూల్‌మిట్ట, మండలాల్లోని ముస్త్యాల, మచ్చిముచ్చల, మద్దూరు, కూటిగల్లు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రా లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పి.. ఇప్పుడు సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.