గుమ్మడిదల: బొల్లారంలోని కుంటలల్లో నిర్మాణాలపై తాను హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు, తప్పుడు పత్రాలు చూపుతున్నారని పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసి కొలను బాల్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలోని కుంటల్లో నిర్మాణాలను కూల్చాలని తన పేరుపై కొందరు కాంగ్రెస్ నాయకులు తప్పుడు పత్రాలను సృష్టించారని, అందులో తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.