calender_icon.png 15 October, 2024 | 4:56 AM

అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదు

15-10-2024 02:41:46 AM

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్/దుబ్బాక/కొండపాక, అక్టోబర్ 14: అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన నేతలను అడ్డుకోవడం కాంగ్రెస్ నాయకులకు తగదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం తొగుటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

తదనంతరం నియోజకవర్గంలోని అప్పనపల్లి, మిరుదొడ్డి, ధర్మారం, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాంపల్లిలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీవో జయదేవ్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని అహ్మదీపూర్, చాట్లపల్లి, ఎర్రవలిలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.