09-04-2025 12:54:45 AM
అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద నిలిపిఉంచలేరు
పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు గవర్నర్ రవికి సుప్రీం ఆదేశం స్టాలిన్ ప్రభుత్వ విజయం!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ అంశంపై తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద నిలిపి ఉంచుకోలేరంటూ వ్యాఖ్యానించింది.
కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్లో ఉంచడం చట్టవిరుద్ధమంటూ తీర్పునిచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్ఎన్ రవికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్ష ణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సుప్రీం వెలువరిం చిన తీర్పు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ‘10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలన్న గవర్నర్ చర్య చట్టవిరుద్ధం.
గవర్నర్ బిల్లును పునఃపరిశీలనకు వెనక్కి పంపిన తర్వాత.. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన అనంతరం రెండోసారి ఆ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి సిఫార్సు చేయకూడదు. అలా చేయ డం చట్టవిరుద్ధం. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొం దినట్టుగానే పరిగణించాలి. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించాలనుకుంటే నెలరోజుల్లోపే గవర్నర్ దానిపై నిర్ణయం తీసుకోవాలి.
రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనుకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ శాశ్వతంగా వాటిని తమ వద్ద ఆపి ఉంచొద్దు’ అని కోర్టు తీర్పులో పేర్కొంది. ఆర్టికల్ 200 ప్రకారం శాసనసభ ఒక బిల్లు ను ఆమోదించి గవర్నర్కు పంపినప్పుడు, ఆ బిల్లుకు ఆమోదముద్ర వేయడం, సమ్మతిని నిలిపేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం చేస్తారు.
తర్వాత మళ్లీ సభ దాన్ని ఆమోదిస్తే.. గవర్నర్ సమ్మతితో నిలిపివేయలేరు. కానీ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయొచ్చు. రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలకు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావి స్తే బిల్లును రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది.
శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే నిలిపేసుకుంటున్నారని తమిళనాడు ప్రభు త్వం ఆరోపిస్తోంది. ఈ విషయంపై 2023 లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సమ్మతించకపోవడం, పునఃపరిశీ లించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంప డం లేదని పిటిషన్లో పేర్కొంది. తాజాగా సుప్రీం తీర్పు వెలువరించింది. స్పందించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇది తమిళనాడుతోపాటు రాష్ట్రాలన్నింటికీ దక్కిన భారీ విజయంమంటూ హర్షం వ్యక్తం చేశారు.