calender_icon.png 18 October, 2024 | 1:04 PM

కొత్తవారితో సినిమా తీయడం గొప్ప విషయం

27-07-2024 12:35:42 AM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నూతన నటీనటులతో రూపొందిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్ళు’ విజువల్స్ బాగున్నాయి.

కొత్త వారితో ఇంత మంచి సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్‌” అన్నారు. ‘కమిటీ కుర్రోళ్ళంతా మూడేళ్లుగా ఈ మూవీ కోసం పనిచేస్తూ వారి పాత్రలకు ప్రాణం పోశారు’ అని నిహారిక చెప్పారు. కార్యక్రమంలో దర్శకుడు వంశీతోపాటు నిర్మాత ఫణి అడపాక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, కెమెరా మెన్ రాజు, చిత్రబృందం పాల్గొన్నారు.