ఖమ్మం (విజయక్రాంతి): కేటీఆర్ బావమరిది కొత్త ఇంట్లోకి వెళ్లిన సందర్భంగా పార్టీ చేసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. సోమవారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దమ్ముంటే ఇచ్చిన ఆరు గ్యారంటీ లను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పటం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వారి అడుగులు మాడుగుల ఒత్తుతున్న పోలీసుల లెక్క తెలుస్తామని అన్నారు.