మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వెలిసిన ప్రాచీనమైన శ్రీ మహాలక్ష్మి దేవి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజానంతరం మంత్రిని శేష వస్త్రాలతో సన్మానించి మహదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందించారు. ఆలయ ఆవరణలో తొమ్మిది రోజులు నిరంతరాయంగా 24 గంటల పాటు నిర్వహించే భజన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమ్మవారి సేవలో తరించారు.