calender_icon.png 7 February, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే వారమే ఐటీ బిల్లు నేడు క్యాబినెట్ ముందుకు

07-02-2025 12:40:07 AM

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆదాయం పన్ను చట్టం స్థానంలో  కొత్త చట్టం రాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పాత చట్టంతో పోలిస్తే ఇందులోని నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా ఉండబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లుపై శుక్రవారం కేంద్ర కేబినెట్‌లో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.