calender_icon.png 24 September, 2024 | 3:01 AM

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

24-09-2024 12:57:13 AM

274 మంది మృతి, 1,000 మందికిపైగా గాయాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: లెబనాన్‌లో ఇజ్రాయెల్ సోమవారం జరిపిన భీకర వైమానిక దాడుల్లో 274 మంది మరణించారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. మరో 1,000 మంది గాయపడ్డారని వెల్లడించింది. మరణించినవారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని పేర్కొంది. లెబనాన్‌లోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడిచేసిట్లు చెప్పింది. అంతకుముందు లెబనాన్‌లోని 300 హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆదివారం ఇజ్రాయెల్‌లో హెజ్బొల్లా చేసిన దాడులకు ప్రతీకారంగా ఐడీఎఫ్ దళాలు రాకెట్ల వర్షం కురిపించాయి. ఈ దాడులతో సరిహద్దు ప్రాంతాల్లోని పలు పట్టణాల్లో పెద్దఎత్తున పొగ కమ్ముకుంది. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతంలోని ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.